జాతీయ వార్తలు

మేఘాలయ పైనాపిల్స్ రుచి చూసిన రాహుల్ గాంధీ

  • భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ
  • మేఘాలయలో కొనసాగుతున్న పాదయాత్ర
  • ఓ పండ్ల దుకాణాన్ని సందర్శించిన రాహుల్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర మేఘాలయ రాష్ట్రంలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మేఘాలయలోని ఓ గ్రామంలో ఉన్న పండ్ల దుకాణాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న ఫలాలను ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు, నోరూరించే మేఘాలయ పైనాపిల్స్ ను రుచిచూశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. మేఘాలయ పైనాపిల్స్ ప్రపంచంలోనే రుచికరమైనవని కాంగ్రెస్ పేర్కొంది.

Related posts

జూన్ 21న విశాఖకు ప్రధాని మోదీ .. ఎందుకంటే..?

Ram Narayana

ఇండిగో ఎఫెక్ట్… టికెట్ ధరల పెంపుపై కేంద్రం ఆగ్రహం…

Ram Narayana

పాకిస్థాన్ లో ట్రెండింగ్ లో రాహుల్ గాంధీ… కారణం ఇదే!

Ram Narayana