జాతీయ వార్తలు

మేఘాలయ పైనాపిల్స్ రుచి చూసిన రాహుల్ గాంధీ

  • భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ
  • మేఘాలయలో కొనసాగుతున్న పాదయాత్ర
  • ఓ పండ్ల దుకాణాన్ని సందర్శించిన రాహుల్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర మేఘాలయ రాష్ట్రంలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మేఘాలయలోని ఓ గ్రామంలో ఉన్న పండ్ల దుకాణాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న ఫలాలను ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు, నోరూరించే మేఘాలయ పైనాపిల్స్ ను రుచిచూశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. మేఘాలయ పైనాపిల్స్ ప్రపంచంలోనే రుచికరమైనవని కాంగ్రెస్ పేర్కొంది.

Related posts

రైలు ఆలస్యంగా నడిస్తే పరిహారం పొందొచ్చు.. ఎలాగంటే?

Ram Narayana

నేడు ప్రధాని మోదీ బర్త్ డే.. వెల్లువలా శుభాకాంక్షలు

Ram Narayana

వయనాడ్ విషాదం… కాపాడాలంటూ శిథిలాల కింది నుంచి బాధితుల ఫోన్!

Ram Narayana