Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పిడుగు పడి ఒకేరోజు 31 మూగజీవాలు మృతి…

అరకులోయ :

విశాఖ ఏజెన్సీలో ఒకే రోజు రెండూ ప్రాంతాల్లో పిడుపాటుతో భారీ నష్టం 31 ముగాజీవులు మృత్యువాత

అరకులోయ మండలం మాదల పంచాయతీ మెదర్ సొల చిట్టంగొంది బాక్సైట్ అటవీ ప్రాంతంలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ పిడుగు పడింది.ఈ పిడుగుపాటుకు 13 ఆవులు 6 మేకలు మృత్యువాత పడ్డాయి.పశువులు కాయడానికి వెళ్ళిన గెమ్మెలి.భీమన్న అనే గిరిజనుడు తోపాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.దీనితో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అరుకు ఏరియా ఆస్పత్రికి డోలిమోత సహాయంతో బంధువులు తీసుకుని వెళ్ళారు.బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కె.రామరావు గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్నలు డిమాండ్ చేశారు.ఈ ఘటనతోపాటు డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ సిలంగొంది అటవీ ప్రాంతంలో పిడుపడి 12 దుక్కిటెద్దులు మృతి చెందాయి.ఒకేసారి గిరిజన కుటుంబాల్లో ఇంత భారీ నష్టం జరగడంతో గిరిజనులు మున్నీరు అవుతూ ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన చెందుతున్నారు.

Related posts

భార్య పెళ్లికి పెద్దగా భర్త.. ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి వివాహం…

Drukpadam

పబ్లిసిటీ కోసం పిటిషన్లు వేస్తారా.. రూ.20 లక్షలు జరిమానా కట్టండి:నటి జుహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్….

Drukpadam

Drukpadam

Leave a Comment