Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పెద్ద వాగు కొట్టుకోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం..

పెద్ద వాగు కొట్టుకోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం
నలుగురు అధికారులకు మెమోలు
వర్షాలకు ముందు డ్యామ్ సేఫ్టీ గురించి ఎందుకు పరిశీలన చేయలేదని ప్రశ్న
తక్కువ సంఖ్యలో ఉద్యోగులు పనిచేయడంపై ఆరా ..

వర్షకాలనికి ముందు పెద్దవాగు ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి అని తనిఖీలు చేశారా?? పెద్దవాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు మరియు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకపోవడానికి గల కారణాలు పై నివేదిక ఇవ్వండి.. – జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ

ప్రాజెక్టు పరిధిలో 30 మంది పని చేయాల్సి ఉండగా కేవలం 10 మందే పని చేసినట్టు సమాచారం..

పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారు అని ఈఈ సురేష్ కుమార్, డీఈఈ కృష్ణ, ఏఈఈ కృష్ణ మరియు ఇంకో ఇతర అధికారి పై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ కి లేఖ రాసిన భద్రాద్రి జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి. వెంటనే అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం …దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అంటున్న అధికార వర్గాలు

Related posts

మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు పూర్తి చేయాలి…మంత్రి తుమ్మల

Ram Narayana

తెలంగాణలో వాన బీభత్సం… తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..

Ram Narayana

పాలమూరు బిడ్డనై ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు నన్ను క్షమించరు: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment