Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల కేసీఆర్ కు లేఖ రాసింది నిజం … కాదని బండి సంజయ్ ప్రమాణం చేయగలరా ?

ఈటల కేసీఆర్ కు లేఖ రాసింది నిజం … కాదని బండి సంజయ్ ప్రమాణం చేయగలరా ?
ఈటల రాజేందర్ కాదు ఇకనుంచి వెన్నుపోటు రాజేందర్: బాల్క సుమన్
కేసీఆర్ కు ఈటల రాసిన లేఖ నిజమైందే…బీజేపీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తుంది.
తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో ఈటల తాకట్టు పెట్టారు
అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర బీజేపీ నేతలది

ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్ కు ముందు కేసీఆర్ కు లేఖ రాశారని అది నిజమైందేనని టీఆర్ యస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు . ఈటల లేఖ రాయలేదని , అది అబద్దపు లేఖ అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్న నేపథ్యంలో బాల్క సుమన్ స్పందించారు. లేఖ నిజమైందని మేము అంటున్నాం , కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయగలరా ? అని సవాల్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైనదని… అది ఫేక్ లెటర్ అని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. అది ఫేక్ లెటర్ అని ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బండి సంజయ్ ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో ఈటల తాకట్టు పెట్టారని… ఢిల్లీ నేతల ముందు మోకరిల్లారని విమర్శించారు.

ఎన్నికల వేళ బీజేపీ వాళ్లు డబ్బు సంచులతో వస్తారని గతంలో ఈటల అన్నారని బాల్క సుమన్ గుర్తు చేశారు. తనకు హైదరాబాదులో 200 ఎకరాలు ఉన్నాయని, ఒక్క ఎకరా అమ్మితే చాలు ఎన్నికల్లో ఖర్చు చేస్తానని చెప్పారని అన్నారు. ఈటల రాజేందర్ ను ఇకపై వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలని ఎద్దేవా చేశారు.

2001 నుంచి తన కుటుంబం టీఆర్ఎస్ తోనే ఉందని… పూటకో పార్టీ మారే మీలాంటి వాళ్లు నాకు నీతులు చెపుతారా? అని మండిపడ్డారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తోన్న చరిత్ర తనదని… అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర బీజేపీ వాళ్లదని విమర్శించారు. బీజేపీ నేతలు పగటి వేషగాళ్లని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పారు.

Related posts

సోనియా కరోనా వ్యాక్సిన్ రహస్యంగా ఎందుకు వేయించుకున్నారు :బీజేపీ…

Drukpadam

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పు పై పుకార్లు…

Drukpadam

బండి సంజయ్‌ బండారం బయట పెడతా : మైనంపల్లి…

Drukpadam

Leave a Comment