Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణలో పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమా?

ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణలో పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమా?
-ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదల గుడిశలు కూల్చివేయడం అన్యాయం
-మానవ హక్కుల కమిషన్ కు ,లోకాయుక్తకు ఫిర్యాదు చేశాం
-తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్

ఖమ్మం లోని 20వ డివిజన్లో పదిహేనేండ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు నోటీసులు ఇవ్వకుండా యుద్ధ ప్రాతిపదికన ఇండ్లు కూల్చివేత తగదు..నిరుపేదలకు జరిగిన అన్యాయంపై మానవహక్కుల కమిషన్, లోకాయుక్తకు ఫిర్యాదు చేశాం..’ అని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్, తెలంగాణ జనవేదిక అధ్యక్షులు కోయిని వెంకన్న,తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం నాయకులు, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా. కేవీ కృష్ణారావు విమర్శించారు.

20వ డివిజన్ పరిధిలోని మమత ఆస్పత్రి, హార్వెస్టు స్కూలు ప్రాంతాల్లోని పేదల ఇండ్లను అధికారులు కూల్చివేసిన ఘటనకు నిరసనగా ఆదివారం ఖమ్మం నగరంలో తెలంగాణ జనవేదిక ప్రతినిధుల ఆధ్వర్యంలో బాధితులతో నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. మొదటిగా పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ జనవేదిక కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ వైరారోడ్డు, కలెకరేట్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకూ కొనసాగింది.

అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు అనంతరం తెలంగాణ జనవేదిక ఉపాధ్యక్షులు, లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ భద్రూనాయక్ అధ్యక్షతన నిరసన సభ జరిగింది.

ఈ సందర్భంగా డా. చెరుకు సుధాకర్, కోయిన్ని వెంకన్న, బానోత్ భద్రూనాయక్, డా.కేవీ కృష్ణారావు మాట్లాడుతూ గత నెల 25,26 తేదీల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున పోలీసులను మొహరించి, పేదలను భయబ్రాంతులకు గురిచేసి, పేదల ఇండ్లు కూల్చివేయడం దారుణమన్నారు. పేదల ఇండ్లు కూల్చి పెద్దలకు కట్టబెట్టేందుకే కొందరు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. పేదల ఇండ్లను కూల్చివేయడంకోసం అధికారులు, అధికార పార్టీ నాయకులకు కొందరు అత్యుత్సాహం వెనుక డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోందన్నారు. వానాకాలంలో పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం చట్టవిరుద్దమన్నారు. ఎర్రజెండాల పార్టీలు ఉన్నాయని అనుకునే జిల్లాలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తడానికి వెనుకాడుతున్నారని విమర్శించారు. గతంలో పేదల ఇండ్లను కూల్చి పెద్దలకు క్రమబద్ధీకరణ చేసిన అధికారులు తాజాగా కూడా ఈ ప్రాంతంలోని కొందరు పెద్దలకు ఈ స్థలాలను క్రమబద్ధీకరణ చేసే కుట్రజరుగుతోందన్నారు. ప్రస్తుతం ఇండ్లు కూల్చిన చోటే ప్రతీ ఒక్కరికీ 125గజాల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇటీవలే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీచేశామని వారు గుర్తుచేశారు. ఇప్పటికే మానవహక్కుల కమిషన్, లోకాయుక్తకు పిర్యాదు చేశామనీ, ఈ నెల 27న వాయిదాకు జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు కూల్చివేయడం దారుణమన్నారు. అందుకే పేదలను ఏకంచేసి వారికి న్యాయంజరిగేంత వరకూ పోరాటంచేస్తాహన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనవేదిక కార్యదర్శి ఎం.రామకృష్ణ, సభ్యులు మందాబుచ్చిబాబు, అఖిల్, ఎం. రాజు, రవిందర్, శ్రీనివాస్, బాధితులు నాగేశ్వరరావు, వెంకట్రావు, స్వరూప, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

Related posts

తుమ్మల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం …. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు!

Drukpadam

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమపార్టీకి లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి!

Drukpadam

పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసు: నారాయణకు బెయిలు మంజూరు

Drukpadam

Leave a Comment