తెలంగాణ వార్తలు

సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ !

  • మావోయిస్టులమంటూ ఆగంతుకుడి బెదిరింపు
  • మధ్యప్రదేశ్‌ నుంచి కాల్‌ చేస్తున్నట్లు తెలిపిన వ్యక్తి
  • దమ్మాయిగూడలో కార్యక్రమంలో ఉండగా ఫోన్
  • డీజీపీ, ఎస్పీలకు రఘునందన్ రావు ఫిర్యాదు

మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత రఘునందన్ రావుకు సోమవారం బెదిరింపు కాల్ రావడం సంచలనం కలిగించింది. మావోయిస్టుల పేరుతో ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, ఆయన్ను అదే రోజు సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై రఘునందన్ రావు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ), మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, మావోయిస్టునని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, రఘునందన్ రావును సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడు.

Related posts

తెలంగాణలో పెరిగిన బీర్ల ధరలు… ఏ బీరు ఎంత పెరిగింది?

Ram Narayana

వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి సీఎం రేవంత్ ఆహ్వానం

Ram Narayana

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ!

Ram Narayana