Telangana Election Commission
తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో 13 పార్టీలకు ఈసీ షాక్ .. గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం!

  • తెలంగాణలో 13 రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు
  • గత ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడమే కారణం
  • గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశం
  • జిల్లా కలెక్టర్ల ద్వారా పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ
  • ఈ నెల 10 లోపు నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచన

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగానే 13 పార్టీలను గుర్తించి చర్యలు ప్రారంభించింది. సంబంధిత పార్టీలకు నోటీసులు అందించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించింది. ఈ విషయంపై దినపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించింది. ఆయా పార్టీల నుంచి వివరణ స్వీకరించిన తర్వాత, వాటి గుర్తింపును రద్దు చేయాలా వద్దా అనే దానిపై స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని స్పష్టం చేసింది. జిల్లాల నుంచి అందిన నివేదికల ఆధారంగా తుది నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Related posts

కిన్నెర కళాకారుడు మొగులయ్య ప్లాట్ కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేసిన దుండగులు

Ram Narayana

ల్యాంప్ కొందామని వెళ్లి.. తెగ షాపింగ్ చేసిన యువతి.. అర చేతిలో ఆరు అడుగుల రశీదు!

Ram Narayana

పంచాయతీ ఎన్నికల్లో పెద్ద పంచాయితీ.. నామినేషన్ పత్రాల చోరీ…

Ram Narayana