KTR
తెలంగాణ వార్తలు

అసెంబ్లీని నడపలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడాపోటీల ఎత్తుగడ వేసింది: కేటీఆర్

ప్రభుత్వం సభను నడపలేక క్రీడా పోటీల ఎత్తుగడ వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడుతూ, సభలో కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకు ప్రభుత్వం ఆటల పోటీలకు తెరతీస్తోందని విమర్శించారు. ఇరిగేషన్ వంటి కీలక పద్దులపై చర్చలు కొనసాగుతుండగా ఆటల పోటీలు ఎందుకని ప్రశ్నించారు.

ఇదే అంశాన్ని తాను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లానని, కానీ ఆయన వద్ద సమాధానం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రజాసమస్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ప్రజాప్రతినిధులు మైదానాలలో ఆటలు ఆడుతుంటే ప్రజలు ఏమనుకుంటారని ప్రశ్నించారు. ఈ నెల 28, 29 తేదీల్లో ప్రభుత్వం క్రీడాపోటీలను నిర్వహించాలని నిర్ణయించిందని, కీలక అంశాలపై చర్చ సమయంలో ఇది సరికాదని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ సమావేశాలను ఆటలపోటీల వంటి కార్యక్రమాల పేరుతో వృథా చేయడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. పద్దులపై చర్చకు సమయం కేటాయించకుండా సభా సమయాన్ని క్రీడలకు కేటాయించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Related posts

విద్యాహక్కును కాపాడేందుకు రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలు ..పీడీఎస్ యూ

Ram Narayana

తెలంగాణ టెన్త్ ఫ‌లితాల విడుద‌ల‌.. సత్తాచాటిన బాలిక‌లు!

Ram Narayana

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి, కేటీఆర్!

Ram Narayana