అంతర్జాతీయం

పైలట్లకు ఎతిహాద్ ఎయిర్ వేస్ హెచ్చరిక…

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కూలి అందులోని 241 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు చేసిన నిపుణుల కమిటీ.. ఇంధన స్విచ్ లు ఆఫ్ కావడం వల్లే విమానం కూలిపోయిందని తేల్చింది. తాజాగా ఈ నివేదిక బయటపెట్టడంతో మిగతా విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి.

దీంతో బోయింగ్‌ విమానాల్లో ఇంధన సరఫరా స్విచ్‌లపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎతిహాద్ ఎయిర్ వేస్ తన పైలట్లకు అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన స్విచ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదేసమయంలో తమ సంస్థకు చెందిన అన్ని విమానాల్లో ఇంధన స్విచ్ ల పనితీరును పరిశీలించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Related posts

మన సైన్యం దెబ్బతీసిన ఎయిర్ బేస్ లో పాక్ మరమ్మతులు…

Ram Narayana

వేలంలో భారీ ధర పలకనున్న ప్రిన్సెస్ డయానా తొలి వర్క్ కాంట్రాక్ట్…

Ram Narayana

ఇంతటి దారుణాలను చూడాల్సి వస్తుందనుకోలేదు: జో బైడెన్

Ram Narayana