అంతర్జాతీయం

పైలట్లకు ఎతిహాద్ ఎయిర్ వేస్ హెచ్చరిక…

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కూలి అందులోని 241 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు చేసిన నిపుణుల కమిటీ.. ఇంధన స్విచ్ లు ఆఫ్ కావడం వల్లే విమానం కూలిపోయిందని తేల్చింది. తాజాగా ఈ నివేదిక బయటపెట్టడంతో మిగతా విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి.

దీంతో బోయింగ్‌ విమానాల్లో ఇంధన సరఫరా స్విచ్‌లపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎతిహాద్ ఎయిర్ వేస్ తన పైలట్లకు అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన స్విచ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదేసమయంలో తమ సంస్థకు చెందిన అన్ని విమానాల్లో ఇంధన స్విచ్ ల పనితీరును పరిశీలించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Related posts

పాక్ ఎన్నికల నుంచి ఇమ్రాన్ ఖాన్ ఔట్

Ram Narayana

ఒలింపిక్ రన్నర్ రెబెక్కాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బాయ్ ఫ్రెండ్

Ram Narayana

కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయుల దుర్మరణం!

Ram Narayana