జాతీయ వార్తలు

లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌గానే ఆధార్ కార్డులు…

  • 14 ఏళ్లలో 11.7 కోట్ల మంది మృతి
  • అయినప్పటికీ 1.15 కోట్ల ఆధార్ కార్డులు మాత్రమే డీయాక్టివేషన్
  • ఆర్టీఐ ద్వారా వెలుగులోకి సమాచారం

దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ, ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది.

ఈ గణనీయమైన అసమానత ఆధార్ డేటా విశ్వసనీయత, అప్‌గ్రేడ్‌పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. సంయుక్త రాష్ట్రాల జనాభా నిధి (యూఎన్ఎఫ్‌పీఏ) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2025 నాటికి భారత జనాభా 146.39 కోట్లకు చేరుకుంది. అయితే ఆధార్ కార్డుదారుల సంఖ్య 142.39 కోట్లుగా ఉంది. అయితే,  సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) డేటా ప్రకారం.. 2007 నుంచి 2019 వరకు సంవత్సరానికి సగటున 83.5 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన గత 14 సంవత్సరాల్లో 11.69 కోట్లకు పైగా మరణాలు జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ యూఐడీఏఐ కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేసింది.

గత ఐదు సంవత్సరాల్లో సంవత్సరం వారీగా ఎన్ని ఆధార్ నంబర్లు మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేయబడ్డాయని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు “అటువంటి సమాచారం మా వద్ద లేదు” అని యూఐడీఏఐ సమాధానమిచ్చింది. డిసెంబర్ 31, 2024 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేయబడ్డాయని మాత్రమే యూఐడీఏఐ తెలిపింది. ఈ అసమానత ఆధార్ వ్యవస్థలో మరణాల రిజిస్ట్రేషన్, డీయాక్టివేషన్ ప్రక్రియలో లోపాలను ఎత్తిచూపుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బాల ఆధార్ అప్ డేట్ చేయకుంటే రద్దు.. యూఐడీఏఐ హెచ్చరిక

Baal Aadhaar Update Deadline UIDAI Issues Alert

బాల ఆధార్.. చిన్నారుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఫొటో, పేరు వివరాలతో జారీ చేసే ఈ కార్డును చిన్నారులకు ఐదేళ్లు దాటాక అప్ డేట్ చేయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ విషయంపై ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ కీలక సూచన చేసింది. ఐదేళ్లు దాటిన తర్వాత బాల ఆధార్ ను అప్ డేట్ చేయాలని, లేదంటే ఆ కార్డు రద్దవుతుందని హెచ్చరించింది. బాల ఆధార్ పొందిన చిన్నారులకు ఐదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు, కనుపాపలు, ఫొటో అప్‌డేట్‌ చేయాలని చెప్పింది.

ఏడేళ్లు దాటినా కూడా అప్ డేట్ చేయకుంటే సదరు బాల ఆధార్ రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈమేరకు బాల ఆధార్ జారీ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఈ విషయంపై అలర్ట్ మెసేజ్ లు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఐదేళ్లు దాటిన, ఏడేళ్లలోపు పిల్లలకు చెందిన బాల ఆధార్ అప్ డేట్ పూర్తిగా ఉచితమని చెప్పారు. ఏడేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ అప్ డేట్ చేయడానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

Related posts

దర్భాంగా మహారాణి రాజే ‘ కామసుందరి దేవి మరణం…

Ram Narayana

తమిళనాడులో జాతీయ విద్యా విధానం అమలు చేసే ప్రసక్తే లేదు: సీఎం స్టాలిన్

Ram Narayana

2027 జనాభా లెక్కలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్… అదే సమయంలో కులగణన కూడా!

Ram Narayana