తెలుగు రాష్ట్రాలు

రాఖీ పండుగ ఎఫెక్ట్…. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్!

  • రాఖీ పండగ సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులు
  • హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్
  • వనస్థలిపురం నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు బారులు తీరిన వాహనాలు
  • ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కూడా దాదాపుగా స్తంభించిన రాకపోకలు
  • గమ్యస్థానాలకు చేరడంలో ఆలస్యంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

రాఖీ పౌర్ణమి పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పండగ రద్దీ కారణంగా శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్ నగర శివార్లలోని వనస్థలిపురం, భాగ్యలత, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కూడా వాహనాలతో నిండిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.

మరోవైపు, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. పండగ రద్దీ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ దాదాపుగా స్తంభించిపోవడంతో, వాహనాలు ముందుకు కదలలేని దుస్థితి ఏర్పడింది. ఈ ఊహించని ట్రాఫిక్ జామ్ వల్ల గంటల తరబడి ప్రయాణం సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

 సీనియ‌ర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు

Ram Narayana

విజయవాడ-హైదరాబాద్ హైవే విస్తరణ.. కిలోమీటర్‌కు రూ.45 కోట్ల అంచనా!

Ram Narayana

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటా విడుదల…

Ram Narayana