జాతీయ వార్తలు

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్.. ప్రతిపాదిస్తూ సంతకం చేసిన సోనియా

  • ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి
  • ఆయన పేరును ప్రతిపాదించిన సోనియాగాంధీ సహా 20 మంది ఎంపీలు
  • తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి

దేశ ఉపరాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి విపక్ష ఇండియా కూటమి తరఫున బరిలో నిలిచారు. ఈరోజు ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీతో పాటు కూటమికి చెందిన 20 మంది ఎంపీలు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేయడం విశేషం.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామం. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన, న్యాయవ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. 2005 నుంచి 2007 వరకు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 2007 నుంచి 2011 వరకు సుమారు నాలుగున్నరేళ్ల పాటు సేవలందించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి పదవీ విరమణ చేశాక, గోవా రాష్ట్రానికి లోకాయుక్తగా కూడా ఆయన పనిచేశారు.

జగదీప్ ధన్ఖడ్ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ ను నిలిపిన సంగతి విదితమే. 

Related posts

పత్తి కోతకు యంత్రం… ఎలా పనిచేస్తుందో చూడండి!

Ram Narayana

చేతికి చిక్కిన భారత జవాన్‌ను చిత్రహింసలకు గురిచేసిన పాకిస్థాన్!

Ram Narayana

సత్య నాదెళ్ల కీలక ప్రకటన: భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు!

Ram Narayana