అంతర్జాతీయం

అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు చిన్నారుల మృతి!

  • మిన్నెసోటా మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో ఘటన
  • విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో కాల్పులు
  • ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేసిన మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. మిన్నెసోటాలోని మినియాపొలిస్‌లో ఓ క్యాథలిక్ పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో పలు ఆయుధాలతో అక్కడికి వచ్చిన నిందితుడు కిటికీల ద్వారా పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై మినియాపొలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఓహారా మాట్లాడుతూ ఆయుధాలతో వచ్చిన నిందితుడు పిల్లలపై కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు. ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించాడని, అతని వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Related posts

మెక్సికోలో ఫుట్‌బాల్ జాతర.. ప్రాణభయంతో సంపన్న పర్యాటకులు!

Ram Narayana

అమెరికాలో భారతీయ యువకుడి హత్య.. కారులో ఉండగా తుపాకీతో కాల్పులు

Ram Narayana

సౌదీలో ఘోర‌ రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది భార‌తీయుల మృతి!

Ram Narayana