జాతీయ వార్తలు

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. త్రుటిలో పెను ప్రమాదం..

  • గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు
  • బోగీ నుంచి పొగలు రావడంతో రైలు నిలిపివేత
  • ఘటనలో మూడు కోచ్‌ల దగ్ధం
  • ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసుల వెల్లడి
  • అగ్నిప్రమాద కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు

పంజాబ్‌లో ప్రయాణికులతో వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించినా, సిబ్బంది అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే… అమృత్‌సర్ నుంచి సహర్సా వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు (Train No. 12204) అంబాలాకు అర కిలోమీటరు దూరంలో ఉండగా, ఒక బోగీ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని సిబ్బంది, ప్రయాణికులు గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. ప్రయాణికులు భయాందోళనతో కిందికి దిగి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులను సకాలంలో రైలు నుంచి దించివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సిర్హింద్ జీఆర్‌పీ ఎస్‌హెచ్‌ఓ రతన్ లాల్ తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు మంటల్లో కాలిపోయినట్లు ఆయన వివరించారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు పంపించారు.

Related posts

షేక్ హసీనా భారత్ ను ఎప్పుడు వీడుతారో చెప్పలేం: విదేశాంగ శాఖ

Ram Narayana

తెలంగాణాలో ఐటీ దాడుల కలకలం ..ఏకకాలంలో 100 బృందాలు ….!

Ram Narayana

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలి: స్టాలిన్

Ram Narayana