పంజాబ్,చండీఘడ్ జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తి వేయండి…గవర్నర్ కు ఐజేయూ వినతి
పంజాబ్,చండీఘడ్ జర్నలిస్టులపై పంజాబ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేసి ప్రజాస్వామ్యవిలువలను కాపాడి ,భావప్రకటన స్వేచ్ఛను రక్షించాలని ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ ఆధ్వరంలో పంజాబ్ ,చండీఘడ్ జర్నలిస్టుల యూనియన్ డిమాండ్ చేసింది . ఈ మేరకు గవర్నర్ గులాబీ చాంద్ కటారియాకు ఐజేయూ వినతి పత్రం అందజేసింది .
పంజాబ్ మరియు చండీగఢ్ జర్నలిస్టుల యూనియన్కు చెందిన జర్నలిస్టులు – మన్దీప్ మక్కర్ (పంజాబీ జాగరణ్), మనిందర్ జీత్ సిద్ధూ (లోక్ ఆవాజ్ టీవీ), మింటూ గుర్సారియా (ఫ్రీలాన్స్ జర్నలిస్ట్) మరియు ఇతర ఆర్టిఐ & సోషల్ మీడియా కార్యకర్తలపై లుధియానా (సిటీ) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసించింది
దేశ ప్రజాస్వామ్య కార్యకలాపాలలో మీడియా ఒక కీలకమైన సంస్థ అలంటి సంస్థను బెదిరింపులు కేసుల ద్వారా బలహీన పరచడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే అవుతుంది . ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సింది పోయి దానిపై దాడిచేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని తెలిపింది . దేశంలోని పని చేసే జర్నలిస్టుల అతిపెద్ద ప్రతినిధి సంస్థ అయిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), పంజాబ్ ప్రభుత్వం ఇటీవల భావప్రకటనా స్వేచ్ఛ , మీడియాపై చేసిన దాడిని మీ దృష్టిని తీసుకురాదల్చం .
పంజాబ్ మరియు చండీగఢ్ జర్నలిస్టుల యూనియన్ సభ్యులైన జర్నలిస్టులు మన్దీప్ మక్కర్ (పంజాబీ జాగరణ్), మనిందర్ సిద్ధూ (లోక్ ఆవాజ్ టీవీ), మింటూ గుర్సారియా (ఫ్రీలాన్స్ జర్నలిస్ట్) మరియు ఇతర ఆర్టిఐ & సోషల్ మీడియా కార్యకర్తలపై లుధియానా (సిటీ) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 12/12/2025 తేదీన ఎఫ్ఐఆర్ నెం. 67 నమోదు చేయబడింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, ఆయన గైర్హాజరీలో పంజాబ్ ప్రభుత్వ హెలికాప్టర్ను దుర్వినియోగం చేయడంపై కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టులు చేసినందుకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అత్యంత దారుణం . లుధియానా (సిటీ) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బి.ఎన్.ఎస్. సెక్షన్లు 353(1), 353(2) మరియు 61(2) కింద ఈ కేసు నమోదు చేశారు
రాష్ట్ర ప్రభుత్వ తమతప్పులను బయటకు రాకుండా జర్నలిస్టులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరచడమే కాకుండా, ప్రజల తెలుసుకునే హక్కును కూడా ఉల్లంఘిస్తుందని ఐజేయూ గట్టిగా భావిస్తోంది.
అందువల్ల ఈ తీవ్రమైన విషయాన్ని అత్యంత తక్షణమే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, రాష్ట్రంలోని పని చేసే జర్నలిస్టుల ఆందోళనలను పరిష్కరించడమే కాకుండా, ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని , భారతదేశం యొక్క సజీవ ప్రజాస్వామ్య మనుగడకు అవసరమైన పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని మేము మిమ్మల్ని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లు గవర్నర్ కు తెలిపింది .గవర్నర్ జోక్యం చేసుకొని జర్నలిస్టులపై కేసులు ఎత్తి వేసే విధంగా చర్యలు తీసుకునేలా చేస్తారని విశ్వసిస్తున్నామని పేర్కొన్నది .గవర్నర్ ను కలిసిన వారిలో ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ముతో పాటు కార్యదర్శి బల్బీర్ సింగ్ జండు మరియు జాతీయ కార్యవర్గ సభ్యుడు జై సింగ్ ఛిబ్బర్ తదితరులు ఉన్నారు …