తెలంగాణ వార్తలు

మున్సిపల్ ఎన్నికలు… ఓటర్లకు బంగారు నాణెమంటూ నకిలీ నాణేలు ఇచ్చిన అభ్యర్థి…

  • సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విస్తుపోయే ఘటన
  • రాగి నాణేనికి పసిడి పూత పూసిన నాణేలు పంచిన అభ్యర్థి
  • నకిలీ నాణేలు ఇవ్వడంపై ఓటర్ల ఆగ్రహం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో నిన్న పోలింగ్ ముగిసింది. చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 

ఇక ఎన్నికల సమయంలో చాలామంది అభ్యర్థులు అనధికారికంగా ఓటర్లకు నగదు, ఇతర బహుమతులు పంచుతుంటారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి ఇచ్చిన కానుక చర్చనీయాంశంగా మారింది. తమకు గోల్డ్ కాయిన్ అని చెప్పి నకిలీ కానుక ఇచ్చారంటూ సిరిసిల్లలో ఓ వార్డులో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు అభ్యర్థి ఓట్లు వేయించుకోవడానికి రాగి నాణేలకు పసిడి పూత పూసి వాటిని బంగారు నాణేలుగా ఇచ్చారని పలువురు వాపోయారు. ఓటర్ల ఆగ్రహం నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు విచారణ చేపట్టారు.

Related posts

జి ఓ 49 పై వెనక్కు తగ్గిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం …

Ram Narayana

గవర్నర్ ఆమోదంలో జాప్యం.. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

Ram Narayana

పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.3,14,545 కోట్లు అని తేల్చేసిన లోక్‌సభ

Ram Narayana