అంతర్జాతీయం

మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాక్ ఆర్మీ చీఫ్‌కు ఊహించని అనుభవం!

  • ఐడీ కార్డు లేదంటూ అడ్డుకున్న సెక్యూరిటీ అధికారి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో
  • అసిమ్ మునీర్‌ను సదస్సుకు పిలవడంపై సింధీ, బలూచ్ నేతల తీవ్ర ఆగ్రహం
  • పాక్‌లో మైనారిటీల అణచివేతకు మునీరే కారణమంటూ తీవ్ర ఆరోపణలు

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు జర్మనీలో ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మ్యూనిచ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు హాజరైన ఆయనను ఓ సెక్యూరిటీ అధికారి అడ్డుకున్నారు. ఆయన తన గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్)ను సరిగా ప్రదర్శించలేదని అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి కొద్ది క్షణాల ముందు ఈ సంఘటన జరిగింది. అసిమ్ మునీర్ మెడలో ఐడీ కార్డు లేకపోవడంతో, సెక్యూరిటీ అధికారి ఆయనను ఆపారు. దాంతో, మునీర్ పక్కనున్న మరో పాక్ సైనికాధికారి తన చేతిలో ఉన్న కార్డును చూపించడంతో, ఆ సెక్యూరిటీ అధికారి ముందుకు పోయేందుకు అనుమతించారు. 

ఈ చిన్నపాటి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై పలువురు విమర్శకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, అంతర్జాతీయ వేదికలపై ఆయనకున్న గౌరవం ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు, అసిమ్ మునీర్‌ను ఇలాంటి సదస్సులకు ఆహ్వానించడం ఏంటంటూ పలువురు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జియే సింధ్ ముత్తాహిదా మహజ్ చైర్మన్ షఫీ బుర్ఫత్ మాట్లాడుతూ, మునీర్‌ను యూరప్‌లోని భద్రతా వేదికలకు పిలవడం పాకిస్థాన్‌లో అణచివేతకు గురవుతున్న సింధీ, బలూచ్, పష్తూన్ వర్గాలను అవమానించడమేనని అన్నారు. “పాకిస్థాన్ రాజకీయాలు, న్యాయవ్యవస్థ, మీడియాను సైనిక బూట్ల కింద నలిపివేస్తున్న మునీర్ శాంతికి ప్రాతినిధ్యం వహించలేరు. ఆయనపై బలవంతపు అదృశ్యాలు, చిత్రహింసలు, హత్యల వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి” అని బుర్ఫత్ ఆరోపించారు.

Related posts

కరెంటు లేదు, తిండి లేదు, షాపుల ముందు బారులుతీరిన ప్రజలు… వెనిజులాలో ప్రస్తుత పరిస్థితి ఇదీ!

Ram Narayana

హిజాబ్ వివాదం: పాశ్చాత్య సంస్కృతిపై ఖొమేనీ సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. భారతీయుల్లో టెన్షన్

Ram Narayana