జాతీయ వార్తలు

శ్రీకాళహస్తి ఆలయంలో త్రిపుర సీఎం ప్రత్యేక పూజలు!

  • శ్రీకాళహస్తీశ్వరుని సేవలో త్రిపుర సీఎం మాణిక్ సాహా 
  • సతీ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న మాణిక్ సాహా
  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నిన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

తొలుత వారికి ఆలయ అధికారులు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వారి వేద ఆశీర్వాదం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. క్షేత్ర మహాత్యం గురించి ఆలయ అధికారులు వివరించారు. 

Related posts

సనాతన ధర్మం, శివుడి గొప్పతనంపై ఎలాన్ మస్క్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ !

Ram Narayana

పళనిలో తెలుగు అయ్యప్ప భక్తుడిపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత…

Ram Narayana