Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు ఘాటు హెచ్చరిక …

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు ఘాటు హెచ్చరిక …
-సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో సమాధానం చెపుతాం
-కూర్చొని చర్చలు జరిపే రోజులు పోయాయి
-ఇప్పుడున్నవి దీటుగా సమాధానం చెప్పే రోజులు
-సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా సరిహద్దులకు ఎవరూ హాని కలిగించలేరనే -సందేశాన్ని పంపాం

జమ్మూకశ్మీర్ లో పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్ ఐడీ కార్డులను తనిఖీ చేసి ఉగ్రవాదులు చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో సమాధానం చెపుతామని హెచ్చరించారు. హాని తలపెట్టే వారితో కూర్చొని చర్చలు జరిపే రోజులు గతంలో ఉండేవని… ఇప్పుడున్నవి ఉగ్రదాడులకు దీటైన జవాబు చెప్పే రోజులని అన్నారు. 2016లో భారత ప్రభుత్వం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ ను ఆయన గుర్తు చేశారు. గోవాలోని ధర్బండోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హయాంలో పాకిస్థాన్ గడ్డపై సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయని అమిత్ షా చెప్పారు. ఈ దాడుల ద్వారా భారత సరిహద్దులకు ఎవరూ హాని కలిగించలేరనే సందేశాన్ని పంపామని అన్నారు. ఇప్పుడు చర్చలు జరిపే సాంప్రదాయం లేదని… తిరిగి ఇవ్వడమే అని చెప్పారు.

Related posts

చంద్రబాబు మోసాలతో జాగ్రత్త.. వాటిని ఇంకా మానలేదు: సజ్జల!

Drukpadam

సిసోడియా అరెస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందన!

Drukpadam

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సంచలంగా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు …

Drukpadam

Leave a Comment