Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూపీ ఎన్నికల్లో సింగిల్‌గానే బరిలోకి కాంగ్రెస్.. అన్ని స్థానాల్లోనూ పోటీ!

యూపీ ఎన్నికల్లో సింగిల్‌గానే బరిలోకి కాంగ్రెస్.. అన్ని స్థానాల్లోనూ పోటీ!
-కాంగ్రెస్ ఒంటరిగానే విజయం సాధిస్తుందన్న ప్రియాంక గాంధీ
-అన్ని స్థానాలకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేస్తామన్న నేత
-ప్రియాంకను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం

దేశంలో మసకబారుతున్న కాంగ్రెస్ ప్రతిష్టను పెంచేందుకు రాహుల్ ,ప్రియాంకలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అనేక రాష్ట్రాలకు నూతన సారధులు రాష్ట్రాల భాద్యతలు అప్పగించారు. మరికొద్దినెలల్లో ఉత్తరప్రదేశ్ లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఒంటరిపోటీకి సిద్దపడుతున్నారు.యూ పి వ్యవహారాలను చూస్తున్న ప్రియాంక గాంధీ ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. యూ పి ఎన్నికల్లో ఒంటరిగానే అన్ని స్థానాలకు పోటీచేస్తామని అన్నారు. 2017 జరిగిన ఎన్నికల్లో సమాజావాది పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసి కేవలం 7 సీట్లను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. మరి ఒంటరిగా పోటీ చేసి ఎన్నిసీట్లు గెలుచుకోగలుగుతుంది అనేది ఆసక్తిగా మారింది.

వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్‌గానే అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. బులంద్‌షహర్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘ప్రతిజ్ఞ సమ్మేళన్-లక్ష్య 2022’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

యూపీలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ప్రియాంక.. అన్ని స్థానాలకు కాంగ్రెస్ కార్యకర్తలనే నామినేట్ చేస్తామన్నారు. కాంగ్రెస్ ఒంటరిగానే విజయం సాధిస్తుందని అన్నారు. కాగా, యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అధికారాన్ని చేపట్టింది.

Related posts

పాకిస్థాన్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడిన అమెరికా!

Drukpadam

భట్టి పాదయాత్రలో పాల్గొంటా ….. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Drukpadam

కేసీఆర్ పార్టీలో ఉన్నవాళ్లంతా తాలిబన్లే.. షర్మిల!

Drukpadam

Leave a Comment