Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల జరిమానా వడ్డించిన ఎన్జీటీ…

ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల జరిమానా వడ్డించిన ఎన్జీటీ…
-పోలవరం పరిధిలో మూడు ఎత్తిపోతల పథకాలు
-పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి పనులు
-పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్న ఎన్జీటీ
-మూడు నెలల్లో జరిమానా చెల్లించాలని ఆదేశాలు

మూలిగే నక్కపై తాటికాయ చందంగా అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్త పట్నం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రూ.120 కోట్ల జరిమానా విధించింది. కేంద్రం పోలవరానికి నిధుల విషయంలో సరిగా ఇవ్వడంలేదని ,కొన్ని సంత్సరాల క్రితం లెక్కల ప్రకారం ఇస్తామని చెప్పి లెక్కకట్టటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విధించిన జరిమానా మూడు నెలల్లో చెల్లించాలని షరతు విధించింది. జరిమానా విషయంలో సర్కార్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆశక్తిగా మారింది.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా వడ్డించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరం పరిధిలోని పురుషోత్త పట్నం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తున్నారంటూ రూ.120 కోట్ల జరిమానా విధించింది. ఇందులో పురుషోత్తపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడికి 73.6 కోట్లు జరిమానా విధిస్తూ ఎన్జీటీ నిర్ణయం తీసుకుంది.

ఈ జరిమానాలను 3 నెలల్లోగా కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీపీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఎన్జీటీ నిర్దేశించింది. పోలవరం పర్యావరణ అంశాలపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యుడు వసంతకుమార్ గతంలో ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Related posts

లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు స్వాతంత్ర్య ఉద్యమ సూర్తితో ఉద్యమిద్దాం…సీపీఎం ఖమ్మం జిల్లాకార్యదర్శి నున్నా

Drukpadam

పోలవరం ప్రాజెక్టు వద్ద కీలక ఘట్టం… స్పిల్ వే ద్వారా నీటి విడుదల…

Drukpadam

మరో వివాదంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్…

Drukpadam

Leave a Comment