Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర మంత్రిపై హరీశ్ రావు ఫైర్‌…

కేంద్ర మంత్రిపై హరీశ్ రావు ఫైర్‌…
మీకు తెలంగాణ రైతుల ఓట్లు కావాలి కానీ… వారి వడ్లు వద్దా?
ఢిల్లీకి వచ్చిన తెలంగాణ మంత్రులకు సమయం ఇవ్వలేదని పియూష్ గోయల్ పై మండిపాటు
ఎంతో ప్రాధాన్యత ఉంటేనే ఇంత మంది మంత్రులు వస్తారని వ్యాఖ్య
తెలంగాణ వడ్లు ఎందుకు కొనరని ప్రశ్న

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ , రాష్ట్రంలోని టీఆర్ యస్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రిని కలిసి వడ్లు కొనాలని విజ్ఞప్తి చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. వారిని కలవకుండా ముందుగా బీజేపీ నాయకులను కలుస్తారా ? రాష్ట్రంలో వడ్లు కొనరుగాని ఓట్లు కావాలా ? అంటూ బీజేపీ పెద్దలను మంత్రి హరీష్ రావు నిలదీశారు. రాష్ట్రంలో రగులుతున్న సమస్య అయినందునే అంతమంది మంత్రులు అక్కడికి వచ్చారు . వారిని పక్కన పెట్టడం దారుణం ఇదేనా మీ నీతి అంటూ నిలదీశారు . కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పై ఫైర్ అయ్యారు .

తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నందుకు మంత్రి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులకు కనీసం సమయం కూడా ఇవ్వలేదని… ఇదే సమయంలో బీజేపీ నేతలకు మాత్రం సమయం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులను పట్టుకుని వారికి పని లేదు అని అంటారా? అని మండిపడ్డారు.ఇదేనా మీ మర్యాద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .

ఎంతో ప్రాధాన్యత ఉంటేనే ఇంత మంది మంత్రులు ఢిల్లీకి వస్తారని… తమ గురించి ఇంత దారుణంగా మాట్లాడే నైతికత మీకెక్కడిదని హరీశ్ ప్రశ్నించారు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అని నిలదీశారు. మీకు తెలంగాణ రైతుల ఓట్లు కావాలి కానీ… వారి వడ్లు వద్దా? అని మండిపడ్డారు. తెలంగాణ వడ్లు ఎందుకు కొనరని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts

మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం: కేటీఆర్

Drukpadam

మద్యం ఔషధం వంటిదన్న బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్… మండిపడిన కాంగ్రెస్!

Drukpadam

బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారని దానిలో వాస్తవం లేదు … బుగ్గన- బుర్ర కథలు చెప్పవద్దు …. పయ్యావుల…

Drukpadam

Leave a Comment