Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులందరూ పాస్…

తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరూ పాస్సర్కారు ప్రకటన!
ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల వెల్లడి
51 శాతం మంది ఫెయిల్
పలువురు విద్యార్థుల ఆత్మహత్య
విద్యార్థి సంఘాల ఆందోళనలు
సర్కారు దిద్దుబాటు చర్యలు

ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి కాగా, 51 శాతం మంది ఫెయిల్ కావడం పట్ల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫలితాలతో వేదన చెంది ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా, భగ్గుమన్న విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

నేపథ్యంలో రాష్ట్ర సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. అయితే ఇలాంటి డిమాండ్లు సరికాదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా మహమ్మారివల్ల విద్యాసంవత్సరం కొంత నష్టపోయినామాట వాస్తవనమేనని అయితే విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించామని అన్నారు .

Related posts

విశాఖ ఎన్ కౌంటర్లో సందె గంగయ్య సహా ఆరుగురు మావోల మృతి!

Drukpadam

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు!

Drukpadam

అమెరికాలో ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకుపోయిన దొంగలు.. చరిత్రలో నిలిచిపోతుందన్న పోలీసులు!

Drukpadam

Leave a Comment