Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మద్యం ఔషధం వంటిదన్న బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్… మండిపడిన కాంగ్రెస్!

మద్యం ఔషధం వంటిదన్న బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్… మండిపడిన కాంగ్రెస్!
-మరోసారి వ్యాఖ్యల కలకలం రేపిన భోపాల్ ఎంపీ
-ఓ క్రికెట్ మ్యాచ్ కు హాజరైన ప్రగ్యా ఠాకూర్
-మద్యం మంచిదేనని వెల్లడి
-అయితే స్వల్ప మోతాదులో తీసుకోవాలని సూచన
-మితిమీరితే విషంలా పనిచేస్తుందని వెల్లడి

వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టిందే పేరైన బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి కలకలం రేపారు. మద్యం సేవించడం మంచిదే అయితే స్వల్ప మోతాదులో మద్యం తీసుకుంటే అది ఔషధంలా పనిచేస్తుందని ప్రగ్యా ఠాకూర్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం ప్రగ్యా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఓ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయుర్వేదంలో మద్యానికి స్థానం ఉందని, కొద్ది మొత్తంలో తీసుకుంటే అది శరీరానికి మేలు చేస్తుందని వివరించారు. అయితే మితిమీరి మద్యం సేవిస్తే అది విషంలా పనిచేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ కొత్త మద్యం పాలసీపై మీడియా ప్రశ్నించగా, ఆమె పైవిధంగా స్పందించారు.

అయితే, ప్రగ్యా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వెలిబుచ్చింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా స్పందిస్తూ, ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మద్యాన్ని ఏమాత్రం వ్యతిరేకించడం లేదని, ఆమె కేవలం తీసుకోవాల్సిన మోతాదు గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ బీజేపీ లమధ్య మతాల యుద్ధం కొనసాగుతుంది. గతంలో కూడా ఆమె అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైయ్యారు.

Related posts

బెంగాల్‌లో హింస.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ…

Drukpadam

భారతీయుల డీ ఎన్ ఏ ఒక్కటే: మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు!

Drukpadam

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఇక యుద్ధమే !

Drukpadam

Leave a Comment