ఆంధ్రప్రదేశ్

తల్లి తండ్రి వేరు వేరు దేశాలు అందుకే రాహుల్ ఆలోచనల్లో తేడా…హర్యానా మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు !

‘ఇటలీ తల్లి, ఇండియన్ తండ్రి.. అందుకే రాహుల్ ఆలోచనల్లోనే తేడా’.. హర్యానా హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • రాహుల్ ‘రెండు భారత్’ల వ్యాఖ్యలకు కౌంటర్
  • పుట్టుక ఆధారంగానే ఆయనకు ఆ ఆలోచనలంటూ విమర్శ
  • సహజంగానే భారత్ రెండుగా కనిపిస్తుందని కామెంట్

‘రెండు భారత్’లు అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. అతడి పుట్టుక ఆధారంగానే రాహుల్ ఆలోచనలు ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇటలీ తల్లి, ఇండియన్ తండ్రి అడుగుజాడల్లో పెరిగిన గాంధీ వారసుడికి.. ఒకటే భారత్ కు బదులు రెండు భారత్ లు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

‘‘రాహుల్ గాంధీకి రెండు భారత్ లు కనిపించడం సహజమే. ఎందుకంటే ఆయన రెండు సంస్కృతుల్లో పెరిగాడు మరి. తల్లి సోనియా గాంధీనేమో ఇటలీ పౌరురాలు. తండ్రి రాజీవ్ గాంధీ భారతీయుడు. అందుకే ఆ రెండు దేశాల సంస్కృతులూ రాహుల్ కు ఒంటబట్టాయి. అందుకేనేమో అతడి ఆలోచనల్లోనే ఏదో తేడా ఉంటోంది’’ అంటూ ట్వీట్ చేశారు.

నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ధనికులకు ఓ భారత్, పేద వారికో భారత్.. అంటూ భారత దేశం రెండుగా విడిపోయిందని వ్యాఖ్యానించారు. పేద, ధనికుల మధ్య అంతరం నానాటికీ పెరుగుతూనే ఉందని అసహనం వ్యక్తం చేశారు.

అది మణిపురి సంస్కృతి.. రాహుల్ జీ తెలుసుకోండి: ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చురక

  • ఒకరి ఇంట్లోకి వెళ్లే ముందు పాదరక్షలు విడుస్తాం
  • ఇది పురాతన మణిపురి సంప్రదాయం
  • మణిపూర్ సంస్కృతి గురించి తెలుసుకోండి
  • రాహుల్ కు బిరేన్ సింగ్ సూచన
Manipuri tradition to remove shoes before entering homes
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రిని కొన్ని రోజులు క్రితం ఢిల్లీలోని ఆయన నివాసంలో మణిపూర్ కు చెందిన నాయకుల బృందం కలుసుకుంది. ఇంట్లోకి ప్రవేశించే ముందు వారితో బలవంతంగా పాదరక్షలు ఇప్పించి అవమానించారంటూ రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. తీరా లోపలికి వెళ్లిన తర్వాత అమిత్ షా పాదరక్షలతో ఉండడాన్ని వారు చూసినట్టు రాహుల్ పేర్కొన్నారు.

దీనిపై మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్పందిస్తూ.. దీనిని మణిపురి సంస్కృతిలో భాగంగా పేర్కొన్నారు. ‘‘ఎవరి ఇంట్లోకి అయినా అడుగు పెట్టే ముందు పాదరక్షలను బయట విడిచి వెళ్లడం అన్నది మణిపురి సంస్కృతిలో ఉన్న పురాతన సంప్రదాయం. దీనిని అవమానంగా ప్రచారం చేయడం అంటే వారు మణిపురి సంస్కృతిని పట్టించుకోకపోవడమే. మిస్టర్ రాహుల్ గాంధీ, మణిపూర్ గురించి మాట్లాడే ముందు మణిపురి సంస్కృతి గురించి కొంత తెలుసుకోండి’’ అంటూ బిరేన్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

Related posts

జయలలిత చివరి రోజుల్లో చదివిన ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మావో జెడాంగ్ పుస్తకం!

Drukpadam

తరగతి గదిలో విద్యార్థి చెంప చెళ్లుమనిపించిన హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్.. 

Drukpadam

తమ తొలగింపు చట్టవిరుద్ధం ….జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షులు సివి రావు ..

Drukpadam