Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య అగాధం …

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య అగాధం …
గవర్నర్ పట్ల తెలంగాణ సర్కార్ అమర్యాదగా ఉందన్న గవర్నర్
ఆమెతో పంచాయతీయే లేదన్న మంత్రి కేటీఆర్
నరసింహన్ లాగా నడుచుకోవడంలేదని ఆరోపణ
కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీ చేసే విషయంలో గవర్నర్ తో విభేదాలు
ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రధాని, హోమ్ మంత్రికి గవర్నర్ ఫిర్యాదు
తెలంగాణ స‌ర్కారుపై కీల‌క వ్యాఖ్య‌లు
రెండు రోజులుగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో త‌మిళిసై
అమిత్ షాతో భేటీ వివ‌రాలు వెల్ల‌డించ‌లేన‌ని ప్ర‌క‌ట‌న‌
రాజ్ భ‌వ‌న్ ప‌ట్ల తెలంగాణ స‌ర్కారు నిర్లక్ష్యంగా ఉంద‌ని ఆవేద‌న‌
త‌న‌కు ప్రొటోకాల్ మ‌ర్యాద ద‌క్క‌లేద‌ని అన‌లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
త‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎవ‌రూ అడ్డుకోలేరన్న త‌మిళిసై

 

తెలంగాణ ప్రభుత్వం …రాష్ట్ర గవర్నర్ తమిళ సై మధ్య పూడ్చలేని అగాధం నెలకొన్నది . బడ్జెట్ సమావేశాలకు ముందు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ . మొదటిసారిగా వస్తున్నా ఆనవాయితీకి కేసీఆర్ సర్కార్ మంగళం పాడింది. అంతకుముందు కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నిర్ణయిస్తూ కాబినెట్ ఆమోదం తో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం ఫైల్ పంపింది . అయితే గవర్నర్ కోటాలో నియమించే వ్యక్తులు ప్రముఖ సాహితి కారులై ఉండాలని కౌశిక్ రెడ్డి లో ఆ క్వాలిటీస్ లేవని గవర్నర్ దాన్ని తిప్పి పంపింది. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి నచ్చలేదు . అక్కడనుంచి గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. చివరకు ప్రభుత్వం గవర్నర్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు విమర్శలు దారితీసింది. దీనిపై గవర్నర్ ప్రధాని మోడీ , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లకు ఫిర్యాదు చేసింది. దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు . ఆమెతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని కూల్ గా చెప్పారు . అదే సందర్భంలో గతంలో ఉన్న గవర్నర్ నరసింహన్ చక్కగా వ్యవహరించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు .

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ గురువారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ స‌ర్కారుపై ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం తాను తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేస్తున్నాన‌ని, ఈ ప‌ద‌విలో ఉండ‌గా తానెప్పుడూ బీజేపీ నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ హోదాలో ఉన్న త‌న‌ను బీజేపీ నేత‌లు కూడా ఒక‌టి, రెండు సార్లు మాత్ర‌మే క‌లిశార‌ని, అది కూడా త‌న‌ను గ‌వ‌ర్న‌ర్‌గా ప‌రిగ‌ణించి మాత్ర‌మే క‌లిశార‌ని ఆమె చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప‌రిస్థితుల‌ను కేంద్ర హోం శాఖ మంత్రికి వివ‌రించాన‌ని చెప్పిన త‌మిళిసై.. భేటీలో చ‌ర్చించిన అన్ని విష‌యాల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌లేన‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోస‌మే ఎప్పుడూ తాను ఆలోచిస్తాన‌ని చెప్పిన గ‌వ‌ర్న‌ర్‌.. తెలంగాణ‌లో రైలు, రోడ్డు మార్గం ద్వారా మాత్ర‌మే తాను ప్ర‌యాణించ‌గ‌ల‌న‌ని వ్యాఖ్యానించారు. అలాంటి ప‌రిస్థితి త‌న‌కెందుకు వ‌చ్చిందో మీరే అర్థం చేసుకోవాలంటూ ఆమె మీడియా ప్ర‌తినిధుల‌తో అన్నారు. తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌యాణించ‌గ‌లిగే ప‌రిస్థితి ఇదేనని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

అయిన‌ప్ప‌టికీ త‌న ప్ర‌యాణాల‌ను తెలంగాణ‌లో ఎవ‌రూ ఆప‌లేర‌ని ఆమె మ‌రో కీల‌క వ్యాఖ్య చేశారు. మేడారం జాత‌ర‌కు తాను వెళ్లినప్పుడు ప్ర‌భుత్వం ప్రొటోకాల్ పాటించ‌లేద‌ని తాను అన‌లేద‌న్న త‌మిళిసై.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ఆ విష‌యాన్ని చెప్పార‌న్నారు. యాదాద్రికి వెళ్లిన‌ప్పుడు తాను బీజేపీ నేత‌గా వెళ్లాన‌ని ప్ర‌భుత్వం ఎలా చెబుతుంద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రెండేళ్ల‌లో తాను బీజేపీ నేత‌ల‌ను ఒక‌టి, రెండు సార్లు మాత్ర‌మే క‌లిశాన‌న్న త‌మిళిసై.. తాను బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్నాన‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వం అభ్యంత‌రాలు త‌న‌కు చెబితే తాను వాటికి స‌మాధానం చెబుతాన‌ని త‌మిళిసై అన్నారు.

ఉగాది వేడుక‌ల‌కు తాను ఆహ్వానిస్తే ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎవ‌రూ ఎందుకు రాలేద‌ని త‌మిళిసై ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించే తీరు ఇదేనా? అని కూడా ఆమె నిల‌దీశారు. గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాన్ని ఎందుకు అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ప్ర‌శ్నించిన త‌మిళిసై.. రాజ్ భ‌వ‌న్ ప‌ట్ల అంత నిర్ల‌క్ష్యం ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

Related posts

తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు…సింవాహ లోకనం..!

Drukpadam

హర్యానా రైతులపై విరిగిన లాఠీ…

Drukpadam

రాహుల్ గాంధీపై వేటు వేసిన తీరు కంటతడి తెప్పిస్తోంది: కోమటిరెడ్డి

Drukpadam

Leave a Comment