నెల్లూరు కోర్టులో చోరీ కేసులో నిందితుల గుర్తింపు… ఇద్దరి అరెస్ట్!
- నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్లను చోరీ చేసిన వైనం
- కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
- ఐదుగురు నిందితుల్లో ఇద్దరి అరెస్ట్
- మిగిలిన ముగ్గురి కోసం పోలీసుల ముమ్మర వేట
ఏపీలో రాజకీయ ప్రకంపనలకు తెర తీసిన నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి పాల్పడింది ఐదుగురు వ్యక్తులని పోలీసులు తేల్చారు.
నిందితులెవరన్న విషయంపై ఓ అవగాహనకు వచ్చిన పోలీసులు మరుక్షణమే వారి కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… మిగిలిన నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్తో ఈ చోరీ వెనుక ఉన్న అసలు గుట్టు ఏమిటన్నది తెలియరానుంది.
నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంపై సోమిరెడ్డి స్పందన
![somireddy responce to kakanis allegatgions](https://i0.wp.com/img.ap7am.com/fit-in/320x213/bimg/cr-20220415tn6259670e0ae21.jpg?resize=320%2C213&ssl=1)
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ .. “విదేశాల్లో నా కుటుంబానికి 1,000 కోట్లు ఉన్నాయన్నారు. నకిలీ పత్రాలతో నా ఇమేజీని దెబ్బతీశారు. కాకాణిపై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అందుకు హైకోర్టు అనుమతి ఉండాలని జడ్జి చెప్పారు. ఈ కేసులో మాకు నమ్మకం ఉంది. నిందితులకు శిక్ష పడుతుంది” అని సోమిరెడ్డి అన్నారు.