Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రశాంత్ కిశోర్ చేరికపై కాంగ్రెస్ లో ఎవరికీ అభ్యంతరం లేదు: దిగ్విజయ్ సింగ్

ప్రశాంత్ కిశోర్ చేరికపై కాంగ్రెస్ లో ఎవరికీ అభ్యంతరం లేదు: దిగ్విజయ్ సింగ్

  • కాంగ్రెస్ గురించి పీకే ఇచ్చిన ప్రజెంటేషన్ బాగుందన్న దిగ్విజయ్
  • ఆయనతో తనకు మంచి బంధం ఉందని వ్యాఖ్య
  • గతంలో ఆయనతో చాలా లోతుగా చర్చలు జరిపానని వెల్లడి

కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సోనియాగాంధీతో వరుస భేటీలు నిర్వహించారు. మరోవైపు పీకేను పార్టీలో చేర్చుకోవడం కొందరు నేతలకు ఇష్టం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ప్రజెంటేషన్ బాగుందని చెప్పారు. పార్టీలోకి ఆయన రాకపై ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. పీకే చెప్పింది పూర్తిగా కొత్తేమీ కాదని, తమకు తెలియంది కూడా కాదని చెప్పారు. అయితే సమస్యను నీవు ఏ విధంగా వివరించావు, దాన్ని పార్టీ ఎలా స్వీకరించింది అనేదే ప్రధానమని అన్నారు.

ప్రశాంత్ కిశోర్ తో తనకు మంచి బంధం ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆయనతో గతంలో చాలా లోతుగా చర్చలు జరిపానని తెలిపారు. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఆయన ప్రయాణం సాగుతుంటుందని చెప్పారు. ఆయనకు ప్రత్యేకంగా ఒక పార్టీకి సంబంధించి కమిట్ మెంట్ ఉండదని అన్నారు. అయితే ఇప్పుడు ఆయన పక్కా వ్యూహాలతో తమ వద్దకు వచ్చారని, ఇది మంచి పరిణామమని చెప్పారు.

Related posts

సవాంగ్ ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది…ఉద్యోగుల ర్యాలీ కారణమా ? పవన్ కళ్యాణ్ !

Drukpadam

ఖబర్దార్ రేణుక చౌదరి పువ్వాడపై ఆరోపణలు చేస్తావా ? టీఆర్ యస్ కు చెందిన ఖమ్మం మేయర్ కార్పొరేటర్లు!

Drukpadam

గులాబీ పార్టీకి ప్రాణం పోసిన ఎర్రపార్టీలు!

Drukpadam

Leave a Comment