Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం!

రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం!

  • అహ్మదాబాద్ నుంచి ముంబయి వస్తున్న మిస్త్రీ
  • చరోటీ వద్ద డివైడర్ ను ఢీకొన్న కారు
  • తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచిన మిస్త్రీ
  • డ్రైవర్ కు, మరో వ్యక్తికి గాయాలు

వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గ్రూప్స్ మాజీ చైర్మెన్ రోడ్ ప్రమాదంలో మృతి చెందినట్లు వచ్చిన వార్త వ్యాపార వర్గాలను విస్మయానికి గురిచేసింది. దేశంలోనే పేరు పొందిన వ్యాపార రంగంలో తమకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న టాటా గ్రూప్స్ లో ఈ సంఘటన విషాదాన్ని నింపింది. గుజరాత్ లోని అహమ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో వస్తున్నా మిస్ట్రీ రోడ్ ప్రమాద మృతిపై రాజకీయ , వాణిజ్య,వర్గాలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చాయి.

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి తిరిగి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్ ను గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన పాల్ఘాట్ ప్రాంతంలోని చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని గుజరాత్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ దుర్మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.

Related posts

బెంగళూరు ఎయిర్ పోర్టులో సిబ్బంది చేతివాటం…

Drukpadam

లిక్కర్ స్కాం లో మరోసారి కవిత పేరు తెరపైకి ….!

Drukpadam

బుర్కినా ఫాసోలో దారుణం.. మిలటరీ యూనిఫాంలో గ్రామంలోకి చొరబడి 60 మంది కాల్చివేత…

Drukpadam

Leave a Comment