Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వద్దిరాజు!

పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వద్దిరాజు!

ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర కీలకమైన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత పెట్రోలియం, సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియామకం చేస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదలైంది. పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు చేపట్టిన పునర్నియామకాలలో వద్దిరాజు కు కీలకమైన స్థాయి సంఘం వరించింది. ఆయన ఈ కమిటీ సభ్యుడిగా తన రాజ్యసభ పదవీకాలం వరకు కొనసాగుతారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, సహజవాయువు నిక్షేపాలు సంబంధిత అంశాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఉభయ సభలకు ఈ అంశాలపై అవసరమైన సూచనలు కూడా చేస్తుంది. పెట్రోలియం, సహజవాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడైన వద్దిరాజు రవిచంద్ర ను టీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కె. కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సహచర పార్లమెంట్ సభ్యులు అభినందించారు.

బిఆర్ఎస్ ను నెలకొల్పిన కేసీఆర్ కు  శుభాకాంక్షలు:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

 

దేశకాల పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం సముచితం:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

దార్శనికులు కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా రూపుదాల్చడం ఖాయం:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కేసీఆర్ కేంద్రంలో ప్రధాన పదవులు అధిరోహించి, దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా రూపుదిద్దుతారు:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కేసీఆర్ నాయకత్వాన్ని,బిఆర్ఎస్ ను నిండు మనస్సుతో బలపర్చవలసిందిగా దేశ ప్రజలకు విజ్ఞప్తి:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ )ని నెలకొల్పిన టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైన కేసీఆర్ దేశంలో ప్రస్తుతం నెలకొన్న అస్తవ్యస్త రాజకీయ, ఆర్థిక పరిస్థితిల పట్ల ఆవేదనతో బిఆర్ఎస్ ను నెలకొల్పి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.విశేష రాజకీయ,పాలనానుభవం,దేశకాల పరిస్థితులపై సంపూర్ణ అవగాహన, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు, వక్తగా మంచి పేరున్న కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం సముచితమని వద్దిరాజు విశ్లేషించారు.టిఆర్ఎస్ ను స్థాపించి అహింసా మార్గంలో మహోద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మహానేత కేసీఆర్ అని ఎంపీ కొనియాడారు.సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తూ,ప్రజలందరి భద్రత,సంక్షేమం, ఉన్నతికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్న కేసీఆర్ ను దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ప్రశంసిస్తున్నారన్నారు.ఇక్కడ కొనసాగుతున్న అభివృద్ధిని చూసి సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,ప్రజలు తమ ప్రాంతాలు కూడా తెలంగాణలో విలీనమవుతే బాగుంటుందని పేర్కొన్న సందర్భాలను గుర్తు చేశారు.ఇటీవల 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు తెలంగాణలో పర్యటించి దండుగ అనుకున్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ అని నిరూపించడాన్ని కళ్లారా చూసి..దేశానికిప్పుడు ఇటువంటి మహానేత అవసరం ఎంతైనా ఉందని కితాబునిచ్చారన్నారు.దార్శనికులు కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని, అఖండ విజయాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని రవిచంద్ర వ్యక్తం చేశారు.కేంద్రంలో కేసీఆర్ మరెన్నో ప్రధాన పదవులు అధిరోహించి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతారని ఆకాంక్షించారు.కేసీఆర్ ను,బీఆర్ఎస్ ను నిండు మనస్సుతో బలపర్చవలసిందిగా దేశ ప్రజలకు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.

Related posts

కేసీఆరే కోర్టుకు వెళ్లి ‘దళితబంధు’ను ఆపుతారు: ఈటల!

Drukpadam

భట్టి పీపుల్స్ మార్చ్ ఖమ్మం నగరంలోకి గ్రాండ్ ఎంట్రీ …ప్రజల బ్రహ్మరథం…

Drukpadam

మంత్రి ఈటల మాటల భావమేమి తీరుమలేశా ?

Drukpadam

Leave a Comment