Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ సాధు జంతువు …బీజేపీ పులి …కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి !

సాధు జంతువులాంటి కాంగ్రెస్ ను చంపారు… అందుకే పులిలాంటి బీజేపీలో చేరాను: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • కేసీఆర్ కు అహంకారం ఎక్కువైందన్న రాజగోపాల్ రెడ్డి
  • విపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం
  • తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని విమర్శలు
  • లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపణ

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రాజగోపాల్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై విరుచుక పడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలనీ కేసీఆర్ చేసిన ప్రయత్నాలపై మండిపడ్డారు . గత ఎన్నికల్లో కాంగ్రెస్స్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 12 మందిని కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు . తెలంగాణ కోసం తెగించి కొట్లాడినవారిని పార్టీనుంచి బయటకు పంపి డబ్బులున్నవారిని పార్టీలో చేర్చుకొని బంగారు తెలంగాణపేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమకాలంలో బలిదానాలు చేసిన కుటుంబాలను కనీసం పట్టించుకోవడంలేదని ఆయన మాత్రం వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు .

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ కు అహంకారం ఎక్కువైందని అన్నారు. ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలను ఎలా కొంటారని ప్రశ్నించారు.

సాధు జంతువులాంటి కాంగ్రెస్ ను చంపి 12 మంది ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. అందుకే తాను పులి లాంటి బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

Related posts

రాహుల్ తెలంగాణ పర్యటన …పెరిగిన రేవంత్ ప్రతిష్ట!

Drukpadam

 వడ్లు కొనకపోతే బీజేపీ ,టీఆర్ యస్ లు రైతు ద్రోహ పార్టీలుగా మిగులుతాయి …ఖమ్మం ధర్నాలో వామపక్ష నేతల హెచ్చరిక !

Drukpadam

బంగారు భార‌త దేశం…కేసీఆర్ కొత్త నినాదం…

Drukpadam

Leave a Comment