Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం

  • ఇప్పటంలో ఇటీవల కూల్చివేతలు
  • గ్రామంలో పర్యటించిన పవన్
  • ఆర్థికసాయం చేస్తానని ప్రకటన
  • కూల్చివేతతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష
  • చెక్కులు పంపిణీ చేయనున్న జనసేనాని

ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 27న పవన్ కల్యాణ్ ఇప్పటం బాధితులకు ఆర్థికసాయం అందించనున్నారు. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది. 

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన గ్రామం ఇప్పటం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటం గ్రామ రైతులు జనసేన సభ ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారని వెల్లడించారు. అయితే, రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారని, ఆ సమయంలో గ్రామస్తులను కలుసుకున్న పవన్ వారి బాధల పట్ల చలించిపోయారని వివరించారు. 

కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికీ లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఈ నెల 27న మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు.

Related posts

‘ఉచిత’ హామీలపై మద్రాసు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు…

Drukpadam

సాధువులను ఏమీ అనొద్దు.. వారెప్పుడు సీఎం అవుతారో ఎవరికి తెలుసు?: సొంతపార్టీపై బీజేపీ నేత వరుణ్‌గాంధీ విసుర్లు

Ram Narayana

పడుగుపాడు వద్ద గాల్లో వేళ్లాడుతున్న పట్టాలు… విజయవాడ-చెన్నై మధ్య రైళ్లు నిలిపివేత

Drukpadam

Leave a Comment