Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు …భట్టి

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు …భట్టి
-ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యనే
-ప్రజాస్వామ్యం కోసం రాహుల్ చేస్తున్న పోరాటానికి దేశం అండగా ఉంటుంది
-నేడు రాహుల్ మోడీ బెదిరింపులకు భయపడకుండా నిలబడ్డ మొనగాడుగా ఉన్నారు

పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీ బహిష్కరణ రాజ్యాంగ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయముగా కనిపిస్తలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు . ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని ,నియంతపోకడలకు నిదర్శనమని మండిపడ్డారు .దీనిపై ప్రతిపక్ష పార్టీలు స్పందించినతీరు మోడీ నిరంకుశపాలన పై ఉన్న ఆగ్రహాన్ని తెలిసాయజేస్తున్నదని అన్నారు .

భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి, గుజరాత్, సూరత్ కోర్టులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడేలా చేసి, ఆ జైలు శిక్ష కూడా కోర్టు ఇచ్చిన తీర్పులోనే హైకోర్టుకు వెళ్లడానికి నెల రోజులు సమయం ఇచ్చింది.
లోక్ సభ స్పీకర్ ఆ నెల రోజులు ఆగకుండా రాజ్యాంగ స్ఫూర్తిని మొత్తంగా పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంటు నుంచి బహిష్కరణ చేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు .

లోక్ సభ స్పీకర్ కు ఒక సభ్యుడిని చట్టసభల నుంచి బహిష్కరించడం, సస్పెండ్ చేయడం విచక్షణ అధికారమైనప్పటికీ, ఆ విచక్షణ అధికారం భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా ఉన్నది. పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు చాలా తెలివైనవారు. దేశం కోసం ప్రజల కోసం మాట్లాడే వారిని గుండెల్లో పెట్టుకొని చూస్తారు.

స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీని 1975 సంవత్సరంలో అలహాబాద్ కోర్టు ఆరేళ్లు బహిష్కరిస్తే తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసిన ఇందిరాగాంధీని బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపించారు.

అప్పటి ప్రభుత్వం ఇందిరాపై వేధింపులకు పాల్పడడానికి సహించలేని ప్రజలు 1980 లో సంపూర్ణ మెజార్టీతో గెలిపించి అధికారం ఇచ్చారు.
ప్రజాస్వామిక వాదులను అనుగదొక్కడం కోసం నియంతృత్వ పోకడలు అవలంబించే ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పిన చరిత్ర ఈ దేశానికి ఉంది
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ఈ దేశ ప్రజలందరూ ఉన్నంటే ఉన్నారు

దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా విభజించి విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటే ప్రజల సంపద ప్రజలకే చెందాలని ఆధాని లాంటి బహుళ జాతి సంస్థలకు కాదని గొంతేత్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ తమకంటే పెద్ద నాయకుడు అయిండన్న భయంతో నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కుట్రతో సూరత్ లో తప్పుడు కేసులు పెట్టింది

దేశ సంపద దోచుకున్న ఆర్థిక నేరస్తులైన నీరవ్ మోడీ, లలిత మోడీలను దేశం దాటించి ప్రజలకు చెందాల్సిన సంపద ప్రజలకే చెందాలన్నందుకు రాహుల్ ను అరెస్టు చేస్తారా? ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడటం రాహుల్ గాంధీ చేసిన తప్పా? అని భట్టి మండిపడ్డారు .

దేశంలో భావ స్వేచ్ఛను చంపేస్తున్నారని, మాట్లాడే వారిని మాట్లాడనివ్వడం లేదని చెప్పడంలో తప్పు ఏముంది? దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు, సిపోర్ట్లు బొగ్గు గనులు, పవర్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రజలకే చెందాలని క్రోని క్యాపిటలిస్టులైన ఆదానికి దోచిపెట్టడం సరికాదన్నందుకే రాహుల్ పై మోడీ కక్ష కట్టారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత ఇందుకోసం ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల వాదులు, లౌకికవాదులు, రాజ్యాంగ ప్రేమికులు ప్రజాస్వామ్యాన్ని, దేశ సంపదను కాపాడుకుందాం.
బిజెపి చేస్తున్న ఈ ఆకృత్యాలను ముక్తకంఠంతో అందరూ ఖండించాలని భట్టి పిలుపు నిచ్చారు .

నిజమైన ప్రజాస్వామ్యవాది, లౌకికవాది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, ప్రగతిశీల సామ్యవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న రాహుల్ గాంధీకి భయపడి శ్రీ నరేంద్ర మోడీ, శ్రీ అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్రయే ఈ బహిష్కరణ వేటు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ మాట్లాడింది నిజమే కాబట్టే అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి

రాహుల్ గాంధీ బహిష్కరణ వేటుకు వ్యతిరేకంగా ఎఐసిసి ప్రత్యేక ఉద్యమ కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఏఐసీసీ కార్యచరణ ప్రణాళిక ప్రకారంగానే తెలంగాణలో కూడా ఉద్యమాలు ఉంటాయి అందులో పాల్గొంటాను. బిజెపికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆసిఫాబాద్లో ఈరోజు సాయంత్రం 2000 మందితో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. .

 

Related posts

కల్తీ సారా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి …చంద్రబాబు డిమాండ్ !

Drukpadam

బీజేపీకో హటావో …దేశ్ కి బచావో … ఖమ్మం బీఆర్ యస్ సభలో కేసీఆర్  పిలుపు …

Drukpadam

పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ తప్పటడుగులు వేయబోతున్నారా?

Drukpadam

Leave a Comment