Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వివేకా హత్య కేసు: ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్!

వివేకా హత్య కేసు: ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్!

  • వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ
  • ఇప్పటికే అవినాశ్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ
  • ఈసారి విచారణలో అరెస్ట్ చేయొచ్చంటూ ప్రచారం
  • తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

త్వరలోనే అవినాశ్ ను సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సీబీఐ గత విచారణ సమయంలోనే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలపై చర్చ జరిగింది. ఆ సమయంలో అవినాశ్ రెడ్డి కోర్టుకు వెళ్లగా, అరెస్ట్ చేయవద్దంటూ తాము ఆదేశాలివ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Related posts

అన్నకు షర్మిలకు బాసట … కేటీఆర్ మాటలపై విమర్శల జల్లు!

Drukpadam

సిపిఎం ప్రజాచైతన్య యాత్రలకు ప్రజల నుంచి స్పందన ….

Drukpadam

హుజురాబాద్ లో కేసీఆర్ పప్పులు ఉడకవు …. చెంప చెల్లు మనిపించేలా తీర్పు :ఈటల !

Drukpadam

Leave a Comment