Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా బారిన 50 మంది భారత్ బయోటెక్ ఉద్యోగులు…

కరోనా బారిన 50 మంది భారత్ బయోటెక్ ఉద్యోగులు…
  • రాజకీయ ఒత్తిళ్లు, విమర్శలు బాధిస్తున్నాయి
  • కొందరు సిబ్బందితోనే రోజంతా టీకాల ఉత్పత్తికి శ్రమిస్తున్నాం
  • భారత్ బయోటెక్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే ‘కొవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థకు చెందిన 50 మంది ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టీకా విషయంలో రాజకీయ ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్నాయంటూ సుచిత్ర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కృషిని పట్టించుకోకుండా చేస్తున్న ఆరోపణలు తమను బాధిస్తున్నాయన్నారు.

తమ సిబ్బందిలో 50 మంది కరోనా బారిన పడి విధులకు దూరంగా ఉన్నారని, అయినప్పటికీ టీకాల తయారీ కోసం శ్రమిస్తూనే ఉన్నామన్నారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ రోజంతా టీకాల ఉత్పత్తి కొనసాగుతోందని అన్నారు. కాగా, సుచిత్ర చేసిన ఈ ట్వీట్‌కు యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మీ సిబ్బందికి టీకా వేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

Related posts

కోవిద్ మరణాల తప్పుడు లెక్కలతో తలలు పట్టుకుంటున్న రాష్ట్రాలు !

Drukpadam

ఆనందయ్య మందు ఆయుర్వేద ఔషధం కాదు: ఆయుష్ కమిషనర్ రాములు….

Drukpadam

తెలంగాణలో కంట్రోల్‌లోనే క‌రోనా-హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస్ రావు…

Drukpadam

Leave a Comment