ఆంధ్రప్రదేశ్

ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం!

ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం!

  • ఝార్ఖండ్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో ఘటన
  • శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స
  • తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారన్న వైద్యులు 

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ నగరంలోగల రిమ్స్ ఆసుపత్రిలో తాజాగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే, శిశువులు తక్కువ బరువు ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని నిశితంగా పరిశీలించేందుకు ఎన్‌ఐసీయూలో పెట్టామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో వెల్లడించారు. ‘‘ఛాటర్‌కు చెందిన ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నాం’’ అని రిమ్స్ వైద్యులు తెలిపారు.

Related posts

వంటగదిలో నిధి… తవ్విచూస్తే రూ.2.3 కోట్ల విలువైన బంగారు నాణేలు!

Drukpadam

రసమయి తీరు మార్చుకో…టీయూడబ్ల్యూ జె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ …

Drukpadam

భట్టి పాదయాత్రకు విహెచ్ సంఘీభావం…

Drukpadam