ఆంధ్రప్రదేశ్

అమెరికాలో తెలుగు ఎన్నారై దుర్మరణం..

అమెరికాలో తెలుగు ఎన్నారై దుర్మరణం..కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో దుర్ఘటన…

  • కాలిఫోర్నియా పాంథర్ బీచ్‌లో గత సోమవారం వెలుగుచూసిన ఘటన
  • సముద్రంలోకి వెళ్లి బయటకు రాలేకపోయిన శ్రీనివాసమూర్తి కుమారుడు
  • తనకు ఈతరాకపోయినా కుమారుడి కోసం నీళ్లల్లోకి దిగిన శ్రీనివాసమూర్తి
  • కొడుకును రక్షించాక అనుకోని ప్రమాదం
  • పెద్ద అల రావడంతో సముద్రంలో మునిగిపోయిన ఎన్నారై
  • అత్యవసర సిబ్బంది ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ ఎన్నారై మృతి

అమెరికాలో నివసిస్తున్న ఓ తెలుగు ఎన్నారై ఇటీవల దుర్మరణం చెందారు. నీట మునుగుతున్న తన 12 ఏళ్ల కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని పాంథర్ స్టేట్‌ బీచ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. గత సోమవారం సాయంత్రం శ్రీనివాసమూర్తి కుమారుడు సముద్రంలోకి వెళ్లి బయటకు రాలేకపోయాడు.

ఇది గమనించిన శ్రీనివాసమూర్తి తనకు ఈత రాకపోయినా నీళ్లల్లోకి దిగి కొడుకును కాపాడారు. ఇంతలో ఓ భారీ అల ఆయనను సముద్రంలోకి లాక్కెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. అత్యవసర సిబ్బంది ఆయనను బయటకు తీసుకొచ్చి స్థానిక ఆసుపత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసమూర్తి మరణించారు.

Related posts

ఈ ఐదు శరీర భాగాల్లో వాపు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా…!

Drukpadam

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఉద్యమ కార్యాచరణ చేపడతాం :కె .రాంనారాయణ!

Drukpadam

రమణ దీక్షితులపై మండిపడ్డ టీటీడీ అర్చకులు ….

Drukpadam