ఆంధ్రప్రదేశ్

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురి దుర్మరణం

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • హైదరాబాద్ నుంచి కారులో వెళ్తుండగా నల్లజర్ల మండలంలో ప్రమాదం
  • మృతుల్లో ముగ్గురు మహిళలు

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన 8 మంది హైదరాబాద్ నుంచి కారులో సొంతూరికి బయలుదేరారు. ఈ క్రమంలో కారు జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి శివారుకు చేరుకున్న తర్వాత అదుపుతప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. 

ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, చిన్నారి కూడా ఉన్నారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న కవిత!

Drukpadam

1 /70 చట్టం పరిరక్షణ కోసం మన్యంలో ఆదివాసీల 48 గంటల బంద్!

Ram Narayana

దేశద్రోహ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు… దేశవ్యాపిత చర్చ!

Drukpadam