Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పొలంలో కనిపించిన యుద్ధ విమానం ఇంధన ట్యాంక్.. స్థానికుల షాక్

  • ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • భారత వాయుసేన యుద్ధవిమానంలో సమస్యతో ఇంధన ట్యాంక్ జారవిడిచిన పైలట్
  • శిక్షణ కార్యక్రమంలో అనుకోకుండా ఈ ఘటన జరిగిందని వాయుసేన ప్రకటన

పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. సంత్ కబీర్‌నగర్ జిల్లా బంజారియా బలుశాషన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంధన ట్యాంకును చూసిన స్థానికులకు తొలుత అదేంటో అర్థంకాక హైరానా పడ్డారు. ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ, వాయుసేనకు తెలియజేశారు. 

యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బాహ్య ఇంధన ట్యాంకును పైలట్ నేలపైకి జారవిడిచారని వైమానిక దళ అధికారులు తెలిపారు. సాధారణ యుద్ధ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విమానం ఆ గ్రామ పరిసరాల్లో పయనిస్తుండగా ఈ సమస్య తలెత్తిందన్నారు. అది జాగ్వార్ యుద్ధ విమానమని అధికారులు పేర్కొన్నారు.

Related posts

300 మంది తాగుబోతు పోలీసులకు వీఆర్ఎస్ ఇచ్చిన అసోం ప్రభుత్వం!

Drukpadam

సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు…

Ram Narayana

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment