జాతీయ వార్తలు

పొలంలో కనిపించిన యుద్ధ విమానం ఇంధన ట్యాంక్.. స్థానికుల షాక్

  • ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • భారత వాయుసేన యుద్ధవిమానంలో సమస్యతో ఇంధన ట్యాంక్ జారవిడిచిన పైలట్
  • శిక్షణ కార్యక్రమంలో అనుకోకుండా ఈ ఘటన జరిగిందని వాయుసేన ప్రకటన

పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. సంత్ కబీర్‌నగర్ జిల్లా బంజారియా బలుశాషన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంధన ట్యాంకును చూసిన స్థానికులకు తొలుత అదేంటో అర్థంకాక హైరానా పడ్డారు. ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ, వాయుసేనకు తెలియజేశారు. 

యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బాహ్య ఇంధన ట్యాంకును పైలట్ నేలపైకి జారవిడిచారని వైమానిక దళ అధికారులు తెలిపారు. సాధారణ యుద్ధ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విమానం ఆ గ్రామ పరిసరాల్లో పయనిస్తుండగా ఈ సమస్య తలెత్తిందన్నారు. అది జాగ్వార్ యుద్ధ విమానమని అధికారులు పేర్కొన్నారు.

Related posts

కాంగ్రెస్ వస్తే హర్యానా సీఎం ఎవరు ..?

Ram Narayana

సల్మాన్ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు…

Ram Narayana

ఆయన మాటలే నిప్పురాజేశాయి.. లేహ్ అల్లర్లపై కేంద్ర హోం శాఖ సీరియస్

Ram Narayana