Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

‘ఇండియా’ చైర్ పర్సన్‌గా సోనియా.. కన్వీనర్‌గా నితీశ్‌కుమార్!

07-08-2023 Mon 09:20 | National

  • బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన ‘ఇండియా’
  • సోనియా నిరాకరిస్తే ఆమె నామినేట్ చేసిన వ్యక్తి చైర్ పర్సన్ అవ్వచ్చు 
  • ఈ నెల 31న ప్రకటించే అవకాశం

బీజేపీకి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ, కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలో ఈ నెల 31, వచ్చే నెల 1న జరగనున్న సమావేశంలో వీరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 

సమన్వయ కమిటీకి సోనియాగాంధీ నాయకత్వం వహించాలని కాంగ్రెస్ నేతలు సోనియాను కోరినట్టు సమాచారం. ఒకవేళ సోనియా అందుకు నిరాకరిస్తే ఆమె నామినేట్ చేసిన వ్యక్తి సమన్వయ కమిటీకి నాయకత్వం వహిస్తారని చెబుతున్నారు. కన్వీనర్‌గా నితీశ్ వైపే మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తోంది.

Related posts

దేశాన్ని ప్రేమిస్తా.. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తా.. : కేజ్రీవాల్

Drukpadam

ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై దుష్ప్రచారం.. రాష్ట్రపతి భవన్ నుంచి ఏపీ సీఎస్ కు ఆదేశాలు!

Ram Narayana

కేరళ వరుస బాంబు పేలుళ్ల ఘటన.. నిందితులు ఆ కారులోనే పారిపోయారా?

Ram Narayana

Leave a Comment