తెలంగాణ వార్తలు

ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపండి… అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ

భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పాలనా సౌలభ్యం, స్థానిక గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఈ విలీనం అత్యవసరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.పురోషోత్తపట్నం , గుండాల, పిచుకలపాడు ఎటపాక కన్నాయుగుడెం గ్రామాలు తెలంగాణ నుంచి ఏపి ల కలవగా భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూముల మాత్రం ఆ గ్రామాల్లోకి వెళ్లి పోయాయి ..దీనితో లీగల్ చిక్కులు ఏర్పడుతున్నాయి .

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తుమ్మల వివరించారు. ఈ గ్రామాలను భద్రాచలంలో విలీనం చేయడం ద్వారా గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ అంశంపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అమిత్ షాను కోరారు.

స్థానిక సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సానుకూలంగా స్పందించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

రైతుల రుణమాఫీ పై మార్గదర్శకాలు ….ఈ విధంగా ఉండే అవకాశం ఉంది…?

Ram Narayana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కీలక మార్పులు

Ram Narayana

ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టాం: మల్లు భట్టి విక్రమార్క

Ram Narayana