Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ నూతన సచివాలయంలో ఆలయం, చర్చి, మసీదు… ఈ నెల 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

  • వేసవిలో ప్రారంభోత్సవం జరుపుకున్న కొత్త సెక్రటేరియట్
  • సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆలయం, చర్చి, మసీదు నిర్మాణం
  • గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి నిదర్శనమన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి 
CM KCR inaugurates three religious prayer houses in new secretariat

ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఎంతో కళాత్మకంగా, అన్ని సదుపాయాలతో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. 

ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఆగస్టు 25న ప్రారంభించనున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. 

నూతన సచివాలయంలో మూడు మందిరాలు గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక అని అభివర్ణించారు. కాగా, ఇక్కడి ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయని తెలిపారు. వీటిని ప్రత్యేకంగా తిరుపతి నుంచి తెప్పించామని వెల్లడించారు. మసీదు, చర్చి ప్రారంభోత్సవం ఆయా మతగురువుల సమక్షంలో జరుగుతుందని వివరించారు.

Related posts

On welfare measures of journalists After January 15 High level meeting

Ram Narayana

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!

Ram Narayana

ప్రయాణికుడికి ఇబ్బంది.. హైదరాబాద్ మెట్రోకు ఫైన్

Ram Narayana

Leave a Comment