జాతీయ వార్తలు

లడఖ్ లో ఘోర ప్రమాదం… 9 మంది ఆర్మీ జవాన్ల దుర్మరణం

  • లోయలో పడిన సైనిక వాహనం
  • లేహ్ జిల్లాలోని ఖేరీ పట్టణానికి సమీపంలో ఘటన
  • సైనిక బలగాల కారు గారిసన్ నుంచి ఖేరీ వెళుతుండగా ప్రమాదం

లడఖ్ లో నేడు ఘోర ప్రమాదం సంభవించింది. ఓ సైనిక వాహనం లోయలో పడిన ఘటనలో 9 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. లేహ్ జిల్లాలోని ఖేరీ పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

ఇవాళ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సైనిక బలగాల కారు గారిసన్ ప్రాంతం నుంచి ఖేరీ తరలి వెళుతుండగా అదుపుతప్పి, లోతైన లోయలోకి పడిపోయిందని అధికారులు వెల్లడించారు.

Related posts

జైపూర్ క్రికెట్‌ స్టేడియానికి మరో సారి బాంబు బెదిరింపులు

Ram Narayana

యువకుడి ఛాతిలో బాణం.. ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు..

Ram Narayana

జ్ఞానవాపి మసీదులో మొదలైన సర్వే..సుప్రీం స్టే

Ram Narayana