అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

  • ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయుల మృతి
  • జాక్సిన్‌విల్ ప్రాంతంలోని ఓ షాపు పార్కింగ్ స్థలంలో దుండగుడి కాల్పులు
  • ఇది జాత్యాహంకార పూరిత దాడి అని పోలీసుల ప్రకటన  

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాత్యాహంకారం అమాయకులను కాటేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయులు మృతిచెందారు. మరణించిన వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. జాక్సన్‌విల్ ప్రాంతంలో గల డాలర్ జనరల్ స్టోర్ వద్ద శనివారం ఈ దారుణం జరిగింది.  

మధ్యాహ్నం దుండగుడు ఏఆర్-15 స్టైల్ రైఫిల్, హ్యాండ్ గన్‌తో వచ్చి పార్కింగ్ స్థలంలో కనిపించిన నల్లజాతీయులపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. జాత్యాహంకారంతోనే నిందితుడు ఈ దుర్మార్గానికి తెగబడ్డాడని జాక్సన్‌విల్ పోలీసులు తెలిపారు.

Related posts

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి ఏడాది.. వైట్‌హౌస్ వద్ద నిరసన తెలుపుతూ నిప్పుపెట్టుకున్న జర్నలిస్ట్..

Ram Narayana

రష్యా చమురు దిగుమతికి భారత్‌కు నెల రోజుల అనుమతి..అమెరికా కీలక నిర్ణయం

Ram Narayana

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు… భారత్‌కు అమెరికా తీవ్ర హెచ్చరిక…

Ram Narayana