అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

  • ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయుల మృతి
  • జాక్సిన్‌విల్ ప్రాంతంలోని ఓ షాపు పార్కింగ్ స్థలంలో దుండగుడి కాల్పులు
  • ఇది జాత్యాహంకార పూరిత దాడి అని పోలీసుల ప్రకటన  

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాత్యాహంకారం అమాయకులను కాటేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయులు మృతిచెందారు. మరణించిన వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. జాక్సన్‌విల్ ప్రాంతంలో గల డాలర్ జనరల్ స్టోర్ వద్ద శనివారం ఈ దారుణం జరిగింది.  

మధ్యాహ్నం దుండగుడు ఏఆర్-15 స్టైల్ రైఫిల్, హ్యాండ్ గన్‌తో వచ్చి పార్కింగ్ స్థలంలో కనిపించిన నల్లజాతీయులపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. జాత్యాహంకారంతోనే నిందితుడు ఈ దుర్మార్గానికి తెగబడ్డాడని జాక్సన్‌విల్ పోలీసులు తెలిపారు.

Related posts

ట్రంప్‌, మస్క్‌ మధ్య వైరం .. ఫీజుగా స్టార్‌లింక్‌ షేర్లు ఇస్తే మధ్యవర్తిత్వం వహిస్తా : రష్యా మాజీ అధ్యక్షుడు

Ram Narayana

ధ్రువీ పటేల్‌కు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటం!

Ram Narayana

ఉగ్రవాదులు స్వాతంత్ర్య యోధులా?.. ఐరాసలో పాక్‌పై భారత్ ఫైర్!

Ram Narayana