అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

  • ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయుల మృతి
  • జాక్సిన్‌విల్ ప్రాంతంలోని ఓ షాపు పార్కింగ్ స్థలంలో దుండగుడి కాల్పులు
  • ఇది జాత్యాహంకార పూరిత దాడి అని పోలీసుల ప్రకటన  

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాత్యాహంకారం అమాయకులను కాటేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయులు మృతిచెందారు. మరణించిన వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. జాక్సన్‌విల్ ప్రాంతంలో గల డాలర్ జనరల్ స్టోర్ వద్ద శనివారం ఈ దారుణం జరిగింది.  

మధ్యాహ్నం దుండగుడు ఏఆర్-15 స్టైల్ రైఫిల్, హ్యాండ్ గన్‌తో వచ్చి పార్కింగ్ స్థలంలో కనిపించిన నల్లజాతీయులపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. జాత్యాహంకారంతోనే నిందితుడు ఈ దుర్మార్గానికి తెగబడ్డాడని జాక్సన్‌విల్ పోలీసులు తెలిపారు.

Related posts

 ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా బ్రతికే ఉన్నాడు.. కానీ కదలలేని స్థితిలో! భారత ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక

Ram Narayana

ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి చేసిన కొన్ని గంటల్లోనే.. యూఏఈలో అతిపెద్ద టెర్మినల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి

Ram Narayana

అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్

Ram Narayana