Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోడీ , కేసీఆర్ , ఎంఐఎం పై ఎందుకు పెట్టడంలేదు ..

విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోడీ , కేసీఆర్ , ఎంఐఎం పై ఎందుకు పెట్టడంలేదు ..
…తుక్కుగూడ సభలో రాహుల్ ధ్వజం
బీజేపీ , బీఆర్ యస్ , ఎంఐఎం పార్టీలు ఒక్కటే…వారిపై పోరాడుతున్నాం
కాంగ్రెస్ ను డిస్ట్రబ్ చేయడానికి బీజేపీకి ఉపయోగపడటమే వారి లక్ష్యం…

తెలంగాణాలో బీజేపీ , బీఆర్ యస్ , ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని …వారిపై పోరాడుతున్నాంమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు .విపక్ష నేతలపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న మోడీ ప్రభుత్వం కేసీఆర్ , ఎంఐఎం నేతలపై కేసులు పెట్టడంలేదని వారి మధ్య ఉన్న రహస్య ఒప్పడమే ఇందుకు కారణమని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు . తెలంగాణ ఇచ్చింది ఒక్క ఫ్యామిలీ కోసం కాదని తెలంగాణ ప్రజల కోసమని స్పష్టం చేశారు . సోనియా గాంధీ చేసిన ఆరు గ్యారంటీ వాగ్దానాలు అములు చేసి తీరుతామని అన్నారు . కాంగ్రెస్ ను డిస్ట్రబ్ చేయడానికి బీఆర్ యస్ బీజేపీ , ఎమ్మెల్మ్ లు చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు . ఈసారి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతామని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు . నాకు ముందు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తూ రైతులకు ,పేదలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని హామీ ఇచ్చారు . సభలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు . సభకు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

బాంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులపై ప్రియాంక నిరసన…

Ram Narayana

ఇందిరాగాంధీ పేరుందని స్కూలు మారాడట.. మహా సీఎం ఫడ్నవీస్ చిన్ననాటి సంఘటన!

Ram Narayana

దేశానికి సరైన సమయంలో సరైన నేత ప్రధానిగా ఉన్నారు: తిరుపతిలో సీఎం చంద్రబాబు…

Ram Narayana

Leave a Comment