తెలంగాణ రాజకీయ వార్తలు ..

తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన సోనియా….

తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన సోనియా….
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం
హైదరాబాదులో కాంగ్రెస్ విజయభేరి సభ
హాజరైన సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన హామీల ప్రకటన

హైదరాబాదులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు హాజరైన పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని సోనియా తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.

ఇక, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. కౌలు రైతుల సహా ప్రతి పట్టా భూమి రైతుకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని వివరించారు. వరి ధాన్యం క్వింటాల్ పై అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ సభకు కేసీఆర్ ఆటంకాలు కల్పించిన తమకు పెరేడ్ గ్రౌండ్ ,గచ్చిబౌలి స్టేడియం ఇవ్వకుండా నిరోధించి తుక్కుగూడలో ప్రభుత్వ భూమిలో సభకు అనుమతి నిరాకరించిన రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారి పట్టాభూములను ఇచ్చారని చెప్పారు .

Related posts

ఈ ఓటమి తాత్కాలిక బ్రేక్ మాత్రమే.. ఫలితాల పట్ల నిరాశవద్దు: కార్యకర్తలతో కేటీఆర్

Ram Narayana

మంత్రి పువ్వాడ ఫ్యూడలిస్టుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత ఈటెల మండిపాటు….

Ram Narayana

బాబూమోహన్‌కు షాకిచ్చిన కుమారుడు.. హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక

Ram Narayana