అంతర్జాతీయం

నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో కంపించిన భూమి

  • రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో నేపాల్‌లో భూకంపం
  • భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ
  • మధ్యాహ్నం గం.2.51 సమయానికి కంపించిన భూమి

నేపాల్‌లో మంగళవారం రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది.

‘3-10-2023 మధ్యాహ్నం 2.51 గంటలకు నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది’ అని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో, హపూర్, అమ్రోహా ప్రాంతాల్లోను ప్రకంపనలు వచ్చాయని తెలిపింది.

Related posts

భారత్‌పై విషం కక్కిన ఆస్ట్రేలియా అతివాది: మెల్‌బోర్న్ కోర్టు వెలుపల జాత్యహంకార విద్వేషం

Ram Narayana

హోలీ సంబ‌రాల్లో పాల్గొన్న న్యూజిలాండ్ ప్ర‌ధాని లుక్సాన్‌..!

Ram Narayana

ఫోర్బ్స్ సెలబ్రిటీ బిలియనీర్లు 2024 వార్షిక‌ జాబితా వ‌చ్చేసింది!

Ram Narayana